Monday, May 6, 2024

Breaking: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. మాథ్యూ వేడ్ అవుట్

టాటా, ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల బ్ర‌బౌర్న్ సీసీఐ ముంబై స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతోంది. పంజాబ్ కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ టీ20లో తొలిసారి పంజాబ్ కింగ్స్ 189 ప‌రుగులు చేసి.. గుజ‌రాత్ ముందు 190 ప‌రుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటన్స్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. కీపర్ మాథ్యూ వేడ్‌ (6) మరోసారి స్వల్పస్కోరుకే వెనుతిరిగాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి వేడ్ అవుటయ్యాడు. రబాడ వేసిన బంతిని ఆఫ్ సైడ్ బాదేందుకు వేడ్ ప్రయత్నించాడు. కానీ మిస్ అవడంతో బ్యాట్‌కు టచ్ అయిన బంతి కీపర్ చేతుల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతుకున్న కీపర్ బెయిర్‌స్టో క్యాచ్ చక్కగా అందుకోవడంతో వేడ్ పెవిలియన్ చేరాడు. గుజరాత్ జట్టు 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వేడ్ అవుటవడంతో క్రీజులోకి బి సాయి సుదర్శన్ వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement