Saturday, May 4, 2024

World Cup | ఆర్చరీలో గ్రాండ్‌ డబుల్‌.. స్వర్ణాలు గెలిచిన పురుషుల, మహిళల జట్లు

ఆర్చరీ ప్రపంచకప్‌లో భాగంగా పారిస్‌లోని 4వ స్టేజ్‌లో ఇవ్వాల (శనివారం) జరిగిన ఈవెంట్లలో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. పురుషులు, మహిళల కాంపౌండ్‌ జట్లు స్వర్ణ పతకాలను గెలుచుకోవడంతో భారతదేశం గ్రాండ్‌ డబుల్‌ను సాధించింది. పర్ణీత్‌ కౌర్‌, అదితి గోపుచంద్‌ స్వామి, జ్యోతి సురేఖ వెన్నం తమ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో 234-233తో ప్రబలంగా జరిగిన రీమ్యాచ్‌లో మెక్సికోను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.

అదే సమయంలో కాంపౌండ్‌ పురుషుల జట్టు కూడా బంగారు పతక పోటీలో విజేతగా నిలిచింది. ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటాలే, ప్రథమేష్‌ సమాధాన్‌ జావ్కర్‌, అభిషేక్‌ వర్మ ఫేవరెట్స్‌ యుఎస్‌ఎపై 236-232తో అదరగొట్టారు. కాంపౌండింగ్‌లో మహిళల జట్టుకు ఇది రెండవ స్వర్ణం కాగా, పురుషుల జట్టు బంగారు పతకాన్ని అందుకోవడం ఇది నాల్గవసారి. ఆర్చరీ ప్రపంచ కప్‌ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన కాంపౌండ్‌ పురుషుల – మహిళల టీమ్‌ పోటీల్లో ఎనిమిది వేర్వేరు దేశాలు స్వర్ణాన్ని గెలుచుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement