Monday, April 29, 2024

Good News …ఆహ్మ‌దాబాద్ చేరుకున్న‌ శుభ‌మ‌న్ గిల్

అహ్మ‌దాబాద్ – భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ డెంగ్యూ నుంచి కోలుకున్నాడు.. దీంతో చెన్నై నుంచి అహ్మ‌దాబాద్ చేరుకున్నాడు.. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం భారత జట్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు బుధవారం రాత్రి చేరుకున్నది. జట్టుతో కలిసి గిల్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో కనిపించాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. అయితే, జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెట్‌ సాధిస్తే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement