Friday, May 3, 2024

Ashwin: మా పిల్ల‌ల‌కు టిక్కెట్లు ఇవ్వండి…

ఐపీఎల్ 17వ సీజన్‌కు మ‌రో మూడు రోజులే ఉంది. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలి పోరు కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. టీమిండియా క్రికెట‌ర్లకు కూడా టికెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి.

- Advertisement -

దాంతో, సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తాజాగా చెన్నై మేనెజ్‌మెంట్‌కు ఓ విజ్ఞ‌ప్తి చేశాడు. త‌న పిల్ల‌ల‌కు మ్యాచ్ టికెట్లు ఇప్పించాల‌ని సీఎస్కేను అభ్య‌ర్థిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ‘చెపాక్ స్టేడియంలో జ‌రిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్ల‌కు ఎక్క‌డ‌లేని డిమాండ్ ఉంది. నా కూతుళ్లు ఐపీఎల్ ఆరంభ వేడుక‌ల‌ను చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ప్లీజ్ సీఎస్కే వాళ్ల‌కు సాయం చేయండి’ అని అశ్విన్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement