Thursday, April 25, 2024

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ లో గాయత్రి- జాలీ జోడి పెను సంచలనం

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్‌ జోడీ పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ జోడి..మాజీ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ఛాంపియన్స్‌ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్‌ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్‌ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్‌ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement