Monday, April 29, 2024

Fourth T20 – ముగిసిన టీమ్ ఇండియా బ్యాటింగ్ – ఆసీస్ టార్గెట్ ఎంతంటే

రాయ్ పూర్ – ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగో టి20లో టీమిండియా .టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది.

రింకూ సింగ్ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ (28 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనపించారు. చివర్లో జితేశ్ శర్మ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సిర్లు) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ మంచి స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వార్షుయిస్ 3 వికెట్లతో మెరిశాడు. బెహ్రాండార్ఫ్, సంఘా చెరో 2 వికెట్లు సాధించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement