Saturday, May 4, 2024

పాక్ టూర్‌కు ఇంగ్లండ్‌ ఓకే…

అగ్రదేశాలతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించాలని చూస్తున్న పాకిస్తాన్‌కు ఇంగ్లండ్‌ శుభవార్త చెప్పింది. పాకిస్తాన్‌ పర్యటనకు వస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. సెప్టెంబర్‌ 20 నుంచి 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. కరాచీ, లాహోర్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 20, 22, 23, 25 తేదీల్లో కరాచీ వేదికగా తొలి 4 టీ20 మ్యాచ్‌లు, సెప్టెంబర్‌ 28, 30, అక్టోబర్‌ 2న లాహోర్‌ వేదికగా తదుపరి మూడు టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో ఇంగ్లండ్‌ జట్టు ఆడనుంది.

టీ20 సిరీస్‌ అనంతరం ఇంగ్లండ్‌ జట్టు నేరుగా ఆస్ట్రేలియాకు చేరుకోనుంది. ఆసియాకప్‌ టోర్నీలో పాల్గొననుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో మళ్లి పాక్‌ పర్యటనకు ఇంగ్లండ్‌ జట్టు రానుంది. మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించి అటు పాకిస్తాన్‌, ఇటు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు ధ్రువీకరించాయి. టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల కాగా, టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ ఇంకా ప్రకటించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement