Monday, May 20, 2024

ఎమ్.ఎస్ సరికొత్త అవతారం… నెటిజన్స్ షాక్

టీమిండియా దిగ్గజ క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు. ధోని ని చూసిన అభిమానులు అయితే ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఈ ఫోటో ను సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో ఒక బౌద్ధ సన్యాసి వేషంలో మహేంద్రసింగ్ ధోని కనిపించారు. అలాగే ధోని ముందు కొంతమంది శిష్యులు కూడా కూర్చుని ఉన్నారు. ఇక ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించే ధోని సడన్ గా ఒక సన్యాసి వేషంలో కనిపించడంతో అభిమానులు తలలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement