Friday, May 3, 2024

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెనర్స్ జోరు.. ఆర్ సి బి బేజారు…

ముంబై – ముంబైలోని బ్రోబొర్న్ స్టేడియంలో జ‌ర‌గుతున్న‌ మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ టి 20 టోర్నిలో ఆర్ సి బి టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది…ఆర్ సి బి టీమ్ కు స్మృతి మంద‌న నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు మెగ్ ల్యానింగ్ స్కిప్ప‌ర్ గా ఉంది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 ఓవ‌ర్ల‌లో 37 ప‌రుగులు చేసింది.. . ఇండియ‌న్ ఓపెన‌ర్ షెఫ‌లీ వ‌ర్మ . స్కీప‌ర్ మెగ్ ల్యానింగ్ లు దూకుడుగా బ్యాటింగ్ కొన‌సాగిస్తున్నారు.. షెఫ‌లీ 21, మెగ్ 15 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.. కాగా ఈరోజు రెండు మ్యాచ్ లు నిర్వ‌హిస్తున్నారు.. రెండో మ్యాచ్ రాత్రి ఏడు గంట‌ల‌కు గుజ‌రాత్ జెయింట్స్ , యుపి వారియ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గనుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement