Thursday, May 2, 2024

ఆసీస్ తో జ‌రిగే చివ‌రి రెండు టి 20 మ్యాచ్ ల జ‌ట్టులో దీప‌క్ చావ‌ర్ కు ఛాన్స్ …

భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం 5 టీ20 ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికీ 3 టీ20లు జరిగితే మొదటి రెండు మ్యాచ్ లను భారత్ గెలవగా నిన్న గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. చివ‌రి రెండు మ్యాచ్ లు జ‌ట్టును బిసిసిఐ ప్ర‌క‌టించింది.. జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా దీపక్ చాహర్ ను అదనంగా స్క్వాడ్ లోకి చేర్చారు. 2022 డిసెంబర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న చాహర్ సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇక చివరి రెండు టీ 20లకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడని బీసీసీఐ సిరీస్ కు ముందే తెలిపింది.

వైస్ కెప్టెన్ గా అయ్యర్ టీమిండియా బాధ్యతలను చేపడతాడు. ఇక మూడో టీ20కి ముందు పేసర్ ముఖేష్ కుమార్ పెళ్లి కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో జరగనున్న నాలుగో టీ20కి ముందు ఈ బెంగాల్ పేసర్ జట్టులో చేరనున్నాడు. ముఖేశ్ కుమార్ స్థానంలో ఆవేశ ఖాన్ నిన్న జరిగిన మూడో టీ20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ లో భారత్2-1 ఆధిక్యంలో ఉంది డిసెంబర్ 1న నాలుగో టీ20, డిసెంబర్ 3న 5 వ టీ20 జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement