Sunday, April 28, 2024

Ram Mandir: అయోధ్య‌లో క్రికెట్ దిగ్గ‌జాలు.. ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుకలో స‌చిన్‌, అనిల్‌కుంబ్లే

అయోధ్య‌లో బాల రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ నేప‌థ్యంలో రాముడి విగ్ర‌హాన్ని కండ్లారా చూసేందుకు క్రీడా దిగ్గ‌జాలు అయోధ్య‌కు చేరుకుంటున్నారు. స‌చిన్ కారులో కొత్త‌గా నిర్మించిన రామ మందిరా నికి వెళ్లాడు. బాల రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ పాల్గొననున్నారు.

కాగా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, గౌతం గంభీర్‌, వెంక‌టేశ్ ప్ర‌సాద్‌లు కూడా అయోధ్య చేరుకున్నారు. మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్, టీమిండియా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు బాల రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుకకు హాజ‌రు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement