Tuesday, May 21, 2024

ఏషియన్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో సక్సేనాకు అభినందనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏసియన్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాద్‌ సక్సేనాను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అన్ని అసెంబ్లి నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను, కోచ్‌లను ప్రోత్సహిస్తూ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.

అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని గణనీయంగా పెంచామన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా కార్యాచరణను క్రీడా శాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సైక్లింగ్‌ క్రీడాకారుడు ఆశీర్వాద్‌ సక్సేనా తల్లిదండ్రులు అనురాగ్‌, కీర్తి సక్సేనా పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement