Friday, May 3, 2024

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌.. శ్రీకాంత్‌ శుభారంభం

స్పెయిన్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. 12వ సీడ్‌ శ్రీకాంత్‌ తొలిరౌండులో విజయం సాధించి రెండో రౌండుకు చేరుకున్నాడు.స్థానికి షట్లర్‌ పాబ్లో అబియాన్‌పై 21-12, 21-16 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు, 36నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పాబ్లోపై శ్రీకాంత్‌ పైచేయి సాధించి విజేతగా నిలిచాడు.

కాగా పురుషుల డబుల్స్‌ జోడీ మను అత్రి, సుమిత్‌రెడ్డి తొలి రౌండులో డెన్మార్క్‌కు చెందిన జోయెల్‌ ఎల్ప్‌-రాస్మస్‌ క్జెర్‌లపై వరుస సెట్లలో పరాజయం పాలయ్యారు. 32నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 16-21, 15-21 తేడాతో ఓడిపోయారు. అంతకుముందు మహిళల డబుల్స్‌ జోడీ పూజ-సంజన తొలి గేమ్‌ను 12-21తేడాతో డచ్‌జోడీ అలిస్సా-ఇమ్కేవాన్‌డెర్‌ఆర్‌ చేతిలో ఓటమిపాలైన తర్వాత వైదొలిగారు. తొలి రౌండులో బై పొందిన ప్రస్తుత ఛాంపియన్‌ సింధు..స్లొవేకియాకు చెందిన మార్టినాతో తన పోరాటాన్ని ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement