హైదరాబాద్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి ఫిక్సింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఓ బుకీ నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు మ్యాచ్ గురించి మెస్సెజ్ పెట్టడం కలకలం రేగింది. వివరాలలోకి వెళితే సిరాజ్కు జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తామంటూ ఒక డ్రైవర్ ఎర చూపాడు. దీంతోపాటు అతడు సిరాజ్కు వాట్సప్ కు మెస్సెజ్ లు కూడా చేశాడు. ఈ మెస్సెజ్ వచ్చిన వెంటనే బీసీసీఐకి నేరుగా సిరాజ్ ఫిర్యాదు చేశాడు.. ఈ సమాచారం తర్వాత, బిసిసిఐ యూనిట్ వేగంగా చర్యలు చేపట్టింది. సిరాజ్ ను సంప్రదించిన డ్రైవర్ను అరెస్టు చేయించింది.. సిరాజ్ను సంప్రదించిన వ్యక్తి బుకీ కాదని, హైదరాబాద్కు చెందిన డ్రైవర్ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ఏమీ లేదని బిసిసిఐ ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement