Wednesday, May 1, 2024

Bold Offer – టీమ్ ఇండియాను ఓడిస్తే డేట్ కు వ‌స్తా…బంగ్లా జ‌ట్టుకు పాక్ న‌టి బంప‌ర్ ఆఫ‌ర్

ప్రపంచ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ఓటమిని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రేపు ఇండియా – బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఒక బోల్డ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇండియాపై బాంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఆకాంక్షించింది. ఇండియాను ఓడిస్తే తాను ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్ తో డేట్ కు వెళ్తానని చెప్పింది. మరోవైపు ఈ టోర్నీలో ఇండియాతో పాకిస్థాన్ మరోసారి తలపడాలంటే ఆ జట్టు కనీసం సెమీస్ కు చేరాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో పాక్ ఇత‌ర జ‌ట్లపై విజ‌యాలు సాధించాల్సి ఉంటుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement