Friday, May 3, 2024

వన్డే సిరీస్‌ పగ్గాలు ధావన్‌కే.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్‌ ఆడనుంది. టీ 20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లెవరూ ఈ వన్డే సిరీస్‌లో ఆడటం లేదు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌ కోసం కొత్త జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ దావన్‌ సారథ్యం వహించనున్నాడు. అతని డిప్యూటిగా శ్రేయాస్‌ అయ్యర్‌ను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఐపిఎల్‌తో బాటు దేశ వాళీల్లో కూడా సత్తాచాటుతున్న రజత్‌ పటీదార్‌కు బీసీసీఐ నుంచి పిలుపువచ్చింది. అతనితో పాటు దేశవాళీల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న ముకేష్‌ కుమార్‌కు కూడా ఈ టీంలో చోటు దక్కింది.

సఫారీలతో వన్డే సిరీస్‌ ఆడే జట్టు..

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, రాహుల్‌ త్రిపాఠీ, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, షాబాజ్‌ అహ్మద్‌, శార్దూర్‌ ఠాకూర్‌, కుల్దిdప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, ముకేష్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌

ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (వన్‌డే సిరీస్‌)
ఫస్ట్‌ వన్‌ డే: రాంచీ (6 అక్టోబర్‌)
సెకండ్‌ వన్డే: లక్నో (9 అక్టోబర్‌)
థర్డ్‌ వన్డే: ఢిల్లి (11 అక్టోబర్‌)

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement