Wednesday, April 24, 2024

బిసిసిఐకి.. ధ‌న్య‌వాదాలు.. ఎంపీ సంతోష్ కుమార్

ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం కోసం కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చిన బీసీసీఐకి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ టీమ్‌ తరఫున ఎంపీ సంతోష్‌ కుమార్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీకి లేఖ రాశారు. అలాగే ట్విట్టర్‌ ద్వారా కూడా ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement