Friday, May 3, 2024

Breaking: ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలిచిన బెంగ‌ళూరు..

టాటా ఐపీఎల్ 2022లో 18వ మ్యాచ్‌లో భాగంగా ఇవ్వాల ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన ఆట‌లో బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై బెస్ట్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టు నిర్ధేశిత ఓవ‌ర్ల‌లో 151 ప‌రుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయింది. కాగా, 152 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన బెంగ‌ళూరు టీమ్ నిల‌క‌డ‌గా ఆడి రెండు వికెట్లు మాత్ర‌మే పోగొట్టుకుని గెలుపు సాధించింది. కాగా, 50 పరుగుల స్కోరు వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయిన బెంగ‌ళూరు, 130 ప‌రుగుల వ‌ద్ద అనుజ్ రావ‌త్ (66), 144 ప‌రుగుల వ‌ద్ద విరాట్ కోహ్లీ ((48) వికెట్ కోల్పోయినా అద్భుతమైన విజయం అందుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement