Wednesday, May 15, 2024

Asian Games – స్క్వాష్‌లో భారత్ కు స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో) భారత్ నేడు రెండో స్వర్ణం గెలుచుకుంది. స్క్వాష్‌లో దీపికా పల్లికల్‌ – హరిందర్‌ సంధు జోడీ విజయం సాధించింది. మలేషియాపై 11-10, 11-10 తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. దీంతో భారత్‌ ఖాతాలోకి 20 పసిడి పతకం చేరింది.

మరోవైపు బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ప్రణయ్‌ పతకం ఖాయం చేసుకున్నాడు. సీనియర్‌ స్క్వాష్‌ ప్లేయర్ సౌరభ్ గోషల్ కూడా సింగిల్స్‌ విభాగంలో పతకంపై కన్నేశారు.

పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భూటాన్‌పై 235-221 తేడాతో విజయం సాధించింది. ఓజాస్‌ ప్రవిణ్‌-అభిషేక్-ప్రథమేష్ సమాధాన్‌తో కూడిన బృందం భూటాన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో సెమీస్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది.

బాక్సర్లు అంతిమ్‌ పంగల్‌ (మహిళల 53 కేజీల విభాగం), మన్సి (మహిళల 50 కేజీల విభాగం) కాంస్య పతకం కోసం తలపడనున్నారు

- Advertisement -

అంతకుముందు ఆర్చరీలో కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం నెగ్గింది. ప్రస్తుతం భారత్‌ పతకాల సంఖ్య 83కి చేరింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement