Sunday, April 28, 2024

మందకృష్ణను పరామర్శించిన వైఎస్ షర్మిల

హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నివాసానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లింది. ఈ సందర్భంగా ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స చేయించుకున్న మందకృష్ణను ఆమె పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వ‌హించ‌బోయే ద‌ళిత భేరి బ‌హిరంగ స‌భ‌కు రావాలని ఆహ్వానించారు. ద‌ళితుల ప‌క్షాన తమ పోరాటానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మందకృష్ణను షర్మిల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement