Monday, April 29, 2024

పూజా హెగ్డేపై వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆగ్రహం

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్‌లలో పూజా హెగ్డే ఒకరు. ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాలు పూజా హెగ్డే చేస్తోంది. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీపై ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు రోజా సెల్వమణి పూజా హెగ్డే పై సంచలన ఆరోపణలు చేశాడు. ఒకప్పుడు పూజా హెగ్డే తన మొదటి సినిమా హీరో జీవాతో చేసినప్పుడు ఒక్క అసిస్టెంట్‌ను మాత్రమే వెంటబెట్టుకుని వచ్చేదన్నారు.

కానీ ప్రస్తుతం 12 మంది అసిస్టెంట్లను పూజా హెగ్డే తన వెంట తీసుకుని వస్తుందని సెల్వమణి ఆరోపించారు. హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచడంతోపాటు తమ వెంట అసిస్టెంట్లను కూడా పెంచడంతో నిర్మాతలకు అదనపు భారంగా మారుతుందని చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హీరోయిన్ల అసిస్టెంట్ల విషయంలో వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పూజా హెగ్డేపై రోజా భర్త ఆగ్రహం వ్యక్తం చేయడం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వార్త కూడా చదవండి: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement