Wednesday, May 1, 2024

యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. మురళీకృష్ణుడి అవతారంలో యాదాద్రీశుడు

యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి శ్రీకృష్ణుడి (మురళీకృష్ణుడు) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. స్వామివారికి ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి వేదమంత్రాలు పఠించారు. సాయంత్రం పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement