Monday, April 29, 2024

World Cup 2023 – ఇండియా – ఇంగ్లండ్ వార్మ‌ప్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం..

గౌహ‌తి – ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వర్షం కారణంగా ఒక్క బాల కూడా ప‌డ‌కుండానే మ్యాచ్ ను ర‌ద్దు చేశారు.. గౌహ‌తిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం జ‌రిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.. మూడు సార్లు అంపైర్లు పిచ్ ను త‌నిఖీ చేశారు. వ‌ర్షం మాత్రం అప్ప‌డ‌ప్పుడు కురుస్తుండటంతో మైదానం అంతా చిత్త‌డిగా మారింది.. చివ‌ర‌కు ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు..

ఇక అస్ట్రేలియా – నెద‌ర్లెండ్స్ మ‌ధ్య తిరువ‌నంత‌పురంలో జ‌ర‌గాల్సి వార్మ‌ప్ మ్యాచ్ సైతం ఇంత వ‌ర‌కు ప్రారంభ‌కాలేదు.. మైదానం అంతా వెట్ గా ఉండ‌టంతో మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్య‌కాలేదు.. దీనిపై అంపైర్లు మ‌రికొద్ది సేప‌టిలో నిర్ణ‌యం తీసుకోనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement