Thursday, April 25, 2024

వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2022..

ఇస్తాంబుల్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 52 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌, 63 కేజీల విభాగంలో పర్వీన్‌, 57 కేజీల విభాగంలో మనీషా తమ ప్రత్యర్థులపై సునాయాసంగా విజయం సాధించారు. నిఖత్‌ జరీన్‌ తన ప్రత్యర్థి మెక్సికో క్రీడాకారిణి హెరెరా అల్‌వరీజ్‌పై 5-0తో గెలుపొందారు.

పర్వీన్‌ ఉక్రెయిన్‌ క్రీడాకారిణి మరియ బొవపై 5-0తేడాతో విజయం సాధించింది. మనీషా తన ప్రత్యర్థి నేపాల్‌ క్రీడాకారిణి కాలా థపాపై ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి, తదుపరి రౌండ్‌లోకి దూసుకెళ్లింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement