Thursday, March 28, 2024

దక్షిణాఫ్రికాతో భార‌త్ టీ20 సిరీస్‌.. జూన్‌ 9న తొలి మ్యాచ్‌

ముంబై: భారత్‌ పర్యటనకు వస్తున్న దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం 5 మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. జూన్‌ 9వ తేదీన మొదలుకానుండగా, జూన్‌ 20 వరకు కొనసాగనున్నాయి. జూన్‌ 9న ఢిల్లిలో తొలి మ్యాచ్‌ జరుగనుండగా, జూన్‌ 12న కటక్‌లో రెండో మ్యాచ్‌, జూన్‌ 14న మూడో టీ20, జూన్‌ 17న రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్‌, జూన్‌ 19న బెంగళూరులో ఐదో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. సౌతాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం టీమిండియా జట్టు ఎంపికపై సెలెక్షన్‌ కమిటీ కసరత్తు మొదలెట్టింది.

ఈ నెల 26న ప్రాబబుల్స్‌ జాబితా ప్రకటించే అవకాశముంది. ప్లేయర్ల ఎంపికపై చర్చించేందుకు చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 23న సమావేశం కానుంది. ఈ భేటీకి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హాజరుకానున్నారు. ఇక జట్టులోకి ఎవరెవరికి స్థానం కల్పించబోతున్నారన్న అంశాన్ని పరిశీలిస్తే.. విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఫామ్‌లో లేని వెంకటేశ్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశాల్లేవని బీసీసీఐ వర్గాల సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement