Wednesday, May 1, 2024

వచ్చే నెల మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ సీజన్‌ వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్‌ స్టేడియం, డివై పాటిల్‌ స్టేడియం ఈ లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ విషయాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధబాలం తెలిపారు.


ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్‌తో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని అరుణ్‌ ధృవీకరించారు. రూ 4, 669.99 కోట్లకు మీడియా హక్కులు బీసీసీఐ కొనుగోలు చేసింది. దాదాపు 1,500 క్రీడాకారులు ఈ లీగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement