Friday, April 26, 2024

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మేయర్ నీతూ కిరణ్

నిజామాబాద్ సిటీ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని సూచించారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా వార్త‌ సేకరణలో పోటీ పడుతుండటం అభినందనీయమని అన్నారు. మీడియా రంగం ఎంతో పవిత్రమైందని నైతిక విలువలు కాపాడుతూ సమాజానికి మంచి వార్తలు అందించాలని చెప్పారు. అనంతరం మీడియా రంగంలో పనిచేస్తున్న పలు వురు మహిళా జర్నలిస్టులు బైస సంగీత, పులగం లావణ్య, అనిత, శ్రీవానిలను మేయర్ శాలువాతో సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement