Monday, April 29, 2024

Tiger attack: చేనులో ప‌త్తి తీస్తున్న మ‌హిళ‌… పెద్ద‌పులి దాడి..అక్కడికక్కడే మృతి

మ‌హారాష్ట్ర‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పొలంలో పత్తి తీస్తున్న మహిళపై పెద్ద పులి దాడి చేసింది. ఈఘ‌ట‌న మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ శివారా గ్రామంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

చనిపోయిన మహిళ పేరు సుష్మా దేవిదాస్ మండల్ (55) అని వెల్లడైంది. అటవీ ప్రాంతంలో ఉన్న చేనులో పత్తి తీస్తుండగా ఉదయం సమయంలో పులి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. తీవ్రంగా గాయపడడంతో సుష్మ మండల్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పత్తి తీస్తున్న మహిళలు భయంతో కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement