Sunday, April 28, 2024

సత్యదేవ్‌..ధనంజయల మల్టీ స్టారర్ ..హీరోయిన్ గా ప్రియాభవాని శంకర్‌

మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు హీరో సత్యదేవ్‌.. ఈశ్వర్‌ కార్తిక్‌ తెరకెక్కిస్తున్నాడు. ధనంజయ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నారు.కాగా సత్యదేవ్‌కు, ధనంజయకు ఈ చిత్రం 26వది కావడం విశేషం. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. కాగా చిత్రబృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియాభవాని శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. క్రైమ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ పతాకంపై బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement