Saturday, May 18, 2024

సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం.. మెట్టుగూడ‌లో సంబురాలు

మెట్టుగూడ (ప్ర‌భ‌న్యూస్‌): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వాల (సోమ‌వారం) పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌ పేరును ప్రకటించడంపై స్థానికంగా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ప‌జ్జ‌న్న విజ‌యంతో హ్యాట్రిక్ సాధిస్తామ‌ని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత అన్నారు.

ప్రజాసేవలో తమ‌కంటూ ప్రత్యేక గుర్తింపును పొంది, సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపార‌న్నారు. రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా తీగుళ్ల పద్మారావు గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చిలకలగూడ బస్ స్టాప్ వద్ద పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానుల సమక్షంలో ప‌టాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement