Saturday, May 11, 2024

బీజేపీ మోసాల నుంచి ప్రజల్ని రక్షిస్తాం: రాహుల్ గాంధీ

గుజరాత్‌ ప్రజలకు తమపార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. అదేసమయంలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వపు వంచన నుంచి ప్రజల్ని కాపాడుతుందని చెప్పారు. రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌, యువతకు 10 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల వరకు రైతు రుణమాఫీ వంటి హామీలను గుజరాత్‌ ప్రజలకు వాగ్దానం చేశాం. అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తాం అని ఆదివారం హిందీలో రాహుల్‌ ట్వీట్‌చేశారు. భాజపా మోసాల నుంచి కాంగ్రెస్‌ మిమ్మల్ని రక్షిస్తుంది. రాష్ట్రంలో అధికార మార్పు వేడుక జరగనుంది అని చెప్పారు. రెండు విడతల్లో ఇక్కడ ఓటింగ్‌ జరగనుంది. డిసెంబర్‌1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించి, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నారు. భాజపా,కాంగ్రెస్‌తోపాటు ఆప్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement