Wednesday, May 8, 2024

క‌ర్ణాట‌కలో అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్.. ఓటు వినియోగించుకున్న సినీ న‌టులు

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎల‌క్ష‌న్ లో న‌టుడు ప్ర‌కాశ్ రాజ్..శాంతిన‌గ‌ర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలనీ. కర్ణాటక అందంగా ఉండాలని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ తో పాటు ప‌లువురు నటులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో అమూల్య తన భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గణేష్, ఆయన సతీమణి, నటుడు రమేష్ అరవింద్ బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అవినీతి ఆరోప‌ణ‌ల‌ను అధిగమించి తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి, ఎన్నికల పునరుజ్జీవనం కోసం చూస్తున్న కాంగ్రెస్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలక పరీక్షగా చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మంత్రి కె.సుధాకర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement