Friday, April 26, 2024

ఈ నెల 27నుండి.. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న వాల్తేరు వీర‌య్య

ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది వాల్తేరు వీర‌య్య చిత్రం. మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కించారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. క్యాథరీన్‌ థెరిస్సా ఓ కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. వాల్తేరు వీరయ్య చిత్రం డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మెగా బ్లాక్‌ బస్టర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement