Saturday, April 27, 2024

VYOOHAM : మార్చి 2న ‘వ్యూహం’ రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ‘వ్యూహం’ సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున‍్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే ‘వ్యూహం’ రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాల‌ని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో ‘వ్యూహం’ సినిమా థియేటర్లలోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement