Thursday, March 28, 2024

వివో ఫ్లాగ్‌షిప్‌ ఎక్స80 సిరీస్‌ విడుదల

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : వివో వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఎక్స్‌80 సిరీస్‌ను ప్రారంభించడంతో భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్‌ ఎక్స్‌ సిరీస్‌ను విస్తరించింది. ప్రత్యేకమైన సిరీస్‌లో ఎక్స్‌80 ప్రో, ఎక్స్‌80 ఉన్నాయి. జీఈఐఎస్‌ఎస్‌ సహకారంతో కొత్త సినిమాటోగ్రఫీ ఫీచర్లతో వినియోగదారులకు తదుపరి స్థాయి ప్రీమియం మొబైల్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఎక్స్‌ 80 ప్రో కాస్మిక్‌ బ్లాక్‌ కలర్‌లో వస్తుంది. అయితే ఎక్స్‌80 కాస్మిక్‌ బ్లాక్‌, అర్బన్‌ బ్లూ అనే రెండు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది. రూ.79,999 (12జీబీ ప్లస్‌ 256జీబీ) ధరతో ఎక్స్‌80 ప్రో విక్రయం ఈనెల 25నుండి ప్రారంభమవుతుందని, ఎక్స్‌80 ధర రూ.54,999 (8జీబీ ప్లస్‌ 128జీబీ), రూ.59,999 (12జీబీ ప్లస్‌ 256జీబీ) ధరతో ఈనెల 25నుండి ప్రారంభమవుతాయని ఆసంస్థ తెలిపింది. సెండు స్మార్ట్‌ఫోన్లు ప్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఈస్టోర్‌, అన్ని పార్టనర్‌ రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని ఆసంస్థ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement