Saturday, May 18, 2024

వేపాడ జెడ్పీ ఉన్నత పాఠశాల సందర్శించిన – క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

వేపాడ జెడ్పీ ఉన్న‌త పాఠ‌శాల‌ని సంద‌ర్శించారు విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి. ఈ సంద‌ర్భంగా పదో తరగతి విద్యార్ధులతో మాట్లాడి వారు పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నదీ తెలుసుకున్నారు. విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధం కావాలని, ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో పది పాయింట్స్ సాధించాలని తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన జిల్లా కలెక్టర్, నిర్వాహకులతో మాట్లాడి విద్యార్థులకు రుచికరంగా, ఆరోగ్య కరంగా ఆహార పదార్థాలు వండి పెట్టాలని సూచించారు.
విద్యార్ధులకు అందిస్తున్న గుడ్ల నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు మండల ప్రత్యేక అధికారులు..ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, సరఫరా చేస్తున్న గుడ్ల నాణ్యత, పదో తరగతి పరీక్షల సన్నద్ధత గురించి ఆరా తీస్తున్నారు ప్రత్యేక అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement