Monday, April 29, 2024

అశోక్ గజపతిరాజు ఓ దొంగ: విజయసాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన చేసిన దొంగ అశోక్ గజపతిరాజు అంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం తప్పదన్నారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్‌‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారన్నారు.

సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించ వద్దని గతంలో తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రవేశంపై లింగ వివక్ష పాటించ వద్దని సుప్రీంకోర్టు చెప్పిందని… కానీ అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పురుషులతో పాటు మహిళలను సీఎం జగన్ సమానంగా గౌరవిస్తారన్నారు. భూకబ్జా వ్యవహారాల్లో టీడీపీ నేతలు తాత్కాలికంగా కోర్టులు నుంచి స్టే తెచ్చుకోగలరు కానీ చేసిన తప్పుకు శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొనమని చెప్పవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement