Tuesday, April 30, 2024

చిరంజీవికి వెల్క‌మ్ చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి..

అమ‌రావ‌తి.. విశాఖ పౌరుడిని అవుతాన‌ని మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌న‌ను వైసిపి ఎంపి విజ‌య‌సాయి రెడ్డి స్వాగ‌తించారు.. విశాఖపట్నంలో నిన్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడ్నవుతానని వెల్లడించారు. భీమిలి రోడ్ లో స్థలం కొనుక్కున్నానని, త్వరలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ , ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు. చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement