Friday, May 3, 2024

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్

జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి సోమవారం నాడు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని విజయసాయి న్యాయస్థానాన్ని కోరారు. అనుమతి ఇస్తే దుబాయ్, ఇండోనేషియా దేశాలకు వెళతానని వివరించారు. విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు.

విజయసాయి తాజా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న మీదట విజయసాయి పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement