Sunday, May 5, 2024

వాటర్ బాటిల్ ఖరీదు రూ.3వేలు.. ప్లేట్ రైస్ ఖరీదు రూ.7,500

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడి పరిస్థితులు దుర్లభంగా మారుతున్నాయి. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో ఆ దేశంలోని ప్రజలు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టులో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్లు భారత కరెన్సీలో దాదాపు 3వేల రూపాయలకు చేరింది. ఇక ప్లేట్‌ రైస్‌కు వంద డాలర్లు భారత కరెన్సీలో 7500 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టులో స్థానిక ఆఫ్ఘన్‌ కరెన్సీని వ్యాపారులు తీసుకోవడం లేదు. కేవలం డాలర్లు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్‌ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ఆకలి దప్పికతో అలమటిస్తున్నారు. మరోవైపు పిల్లల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద దాదాపు 50వేల మంది వరకు జనం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయటపడేందుకు ప్రజలు విమానాశ్రయానికి చేరుతున్నారు. ఇందులో కొంత మందిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తుండడంతో వేలాది మంది వెలుపల నిరీక్షిస్తున్నారు. అందరినీ లోపలకి అనుమతించకపోవడంతో బయటే పడిగాపులు పడుతున్నారు. ఎలాగైనా తాలిబన్ల నుంచి బయటపడాలని అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఇందిరాపార్క్ వద్ద బ్యానర్.. పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement