Friday, April 26, 2024

Congress: రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. పోస్టర్​ ట్వీట్​ చేసిన వాద్రా, కామెంట్స్ చేసిన బీజేపీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన పోస్టర్‌ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. ప్రియాంకగాంధీతో రాబర్ట్‌ వాద్రాకు వివాహం జరిగినప్పటి నుంచి, కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాను ప్రైవేట్‌ వ్యక్తి మాత్రమే అని ప్రకటిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా ఆయన లబ్ది పొందడం లేదని వాదిస్తోంది. అయితే, వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ జన రల్‌ సెక్రటరీ ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా బుధవారం ట్విట్టర్‌లో భారత్‌ జోడో యాత్ర ఫొటోలను షేర్‌ చేశారు.

వాద్రా షేర్‌ చేసిన ఫొటోల్లో, రాహుల్‌, ప్రియాంకలతో పాటు ఆయన కూడా ఉండడాన్ని బీజేపీ విమర్శించింది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో కూడా పాల్గొంటారా, ఆ వ్యాఖ్యలు వినడానికి సైతం హాస్యాస్పదంగా ఉందని మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌, ప్రియాంకల పక్కనే ఆ సైజులోనే వాద్రా ఫొటోను ముద్రించడాన్ని కూడా ఆయన విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement