Friday, May 3, 2024

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేయాలి : మంత్రి గంగుల

ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టార‌ని, అంద‌రు భాగ‌స్వాములై కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో నిర్వ‌హించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. నాలుగ‌వ విడ‌త ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర్ మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మునిసిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement