Saturday, May 4, 2024

ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడుని కలిసిన యూపీ సీఎం యోగి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుణ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న యోగి ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వెంకయ్య నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ మరింత అభివృద్ధిని సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. 2017లో వెంకయ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బి.ఎల్ సంతోష్, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లనూ కలిసిన యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement