దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో భారత కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. వరుస విజయాలు వారికి మద్దతునిస్తున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ సిక్స్ దశలో ప్రత్యర్థులను మట్టికరిపించిన యువ భారత్ సెమీస్లోకి దూసుకెళ్లి ఫైనల్స్కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కాగా, ఈ టోర్నీ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికా అండర్ 19 జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 6 (మంగళవారం) బెనోనిలో జరగనుంది.
సూపర్ సిక్స్లోని రెండు గ్రూప్లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు (భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) సెమీఫైనల్కు చేరుకున్నాయి. మెదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడనుండగా… రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11న జరగనుంది.