Friday, May 17, 2024

Breaking: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి- ఎస్ఎం కొత్తపల్లి గ్రామాల మధ్య శుక్రవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన మనోహర్, చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన సతీష్ గా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదస్థలానికి భూపాలపల్లి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement