Tuesday, May 21, 2024

అమ్మాయి లోదుస్తులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు..

 ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఓ వింత కేసు నమోదయ్యింది. అమ్మాయిల లోదుస్తులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు నమోదయ్యింది. దొంగలు ఎవరైన ఖరీదైన వస్తువులను కాని డబ్బులను గాని దొంగతనం చేయడం విని ఉంటాము. కాని వీరెవరో వింతగా అమ్మాయిల లోదుస్తులను అపహరిస్తున్నారు. అయితే అక్కడ అంతకన్న వింత మరొకటి జరిగింది. లోదుస్తులు పోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది విని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ అవాక్కవుతున్నారు.

దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్కూటీపై ఓ ఇద్దరు యువకులు అమ్మాయి లోదుస్తులను దొంగిలించి పారిపోతున్నట్లు అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అయితే అక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఇలాంటి సంఘటన గతంలోనూ జరిగిందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురు లోదుస్తులను దొంగలించి.. ఏవైనా తాంత్రిక పూజలు నిర్వహిస్తారేమోనని సదరు బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై, ఎ.ఎస్.పి సూరజ్ రాయ్ మాట్లాడుతూ బాలికల బట్టలు దొంగిలించే ఈ ప్రత్యేకమైన కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు.

https://twitter.com/sachingupta787/status/1371063578132905984?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1371063578132905984%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fthieves-stole-girls-clothes-strange-theft-case-video-goes-viral-439793.html
Advertisement

తాజా వార్తలు

Advertisement