Thursday, May 16, 2024

ఒక గ్రాము బదులు.. రెండు గ్రాముల బంగారం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు టీటీడీ క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మంలో భాగంగా ల‌బ్ధిదారుల‌కు ఇచ్చే తాళిబొట్టులో ఒక గ్రాము బంగారం ఉండేది. ఇప్పుడు ఆ గ్రాము బంగారాన్ని రెండు గ్రాములు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం టీటీడీ ట్రెజ‌రీలో ఉన్న 20 వేల తాళిబొట్లు ఇందుకోసం వినియోగించుకోవాల‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌క‌మండ‌లి నిర్ణ‌యించింది. టీటీడీ ప్ర‌తి ఏటా పేద జంట‌ల‌కు సాముహిక వివాహాలు చేస్తుంది. వీరికి స్వామివారి త‌రఫున స్వ‌యంగా తాళిబొట్టు, మెట్టెలు ఉచితంగా ఇవ్వ‌టం అన‌వాయితీగా వ‌స్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement