Thursday, April 25, 2024

శ్రీవారి సేవ‌లో కేంద్ర‌మంత్రి దంప‌తులు- చిత్ర‌ప‌టాన్ని అంద‌జేసిన టీటీడీ చైర్మ‌న్

శ్రీవారిని ద‌ర్శించుకున్నారు కేంద్ర‌మంత్రి దంప‌తులు .. శ‌నివారం రాత్రే తిరుమ‌ల చేరుకున్న హ‌ర్‌దీప్ సింగ్ దంప‌తులు… ఆదివారం వెంక‌న్న స్వామిని ద‌ర్శించుకుని ఆయ‌న సేవ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి వెంక‌న్నస్వామి ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను చేశారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి.. ద‌ర్శ‌నానంత‌రం మంత్రికి స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు, శ్రీవారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా హ‌ర్‌దీప్ సింగ్ పురి… 1987 నుంచి ఏటా తాను స్వామి వారి సేవ‌లో పాల్గొంటున్నాన‌ని తెలిపారు. స్వామి వారి ద‌ర్శ‌నంతో త‌న‌లో కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్లుగా ఉంటుంద‌ని, ఈ కార‌ణంగానే ఏటా తాను త‌ప్ప‌నిస‌రిగా తిరుమ‌ల వ‌స్తుంటాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement