Wednesday, May 15, 2024

వెబ్‌సైట్‌లో మార్చి 1 నుంచి టీఎస్‌ సెట్‌ హాల్‌టికెట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్ల అర్హత పరీక్ష అయిన టీఎస్‌ సెట్‌ను మార్చి 13, 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను మార్చి 1వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీబీటీ పద్ధతిలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 29 సబ్జెక్టులకుగానూ ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement