Sunday, April 28, 2024

Tourism Train: ఫుడ్ పాయిజన్.. 40మందికి అస్వ‌స్థ‌త

టూరిజం ట్రైన్ లో ఫుడ్ పాయిజ‌న్ కావ‌డంతో 40మంది ప్ర‌యాణీకులు అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. ఆహారం తిన్న 40మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్‌కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్పించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు. చెన్నై నుంచి పుణె వెళ్తున్న భారత్ గౌరవ్ రైలులో సుమారు వెయ్యి మంది ప్రయాణించారు. అయితే మంగళవారం పూణె చేరే ముందు ఆ రైలులో ఆహారం తిన్న సుమారు 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.

ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, కడుపులో నొప్పి, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పూణె రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే, స్థానిక డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే రైల్వే స్టేషన్‌కు రప్పించారు. పూణెకు చేరుకున్న ఆ రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వెంటనే వైద్య చికిత్స అందించారు. మరోవైపు భారత్ గౌరవ్ యాత్ర రైలును ఒక ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కలుషిత ఆహారం సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement